ప్రథమ వైద్యురాలు – ఆనందీబాయి జోషి

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా!
ఇంట్లోనూ చుట్టుప్రక్కల మనుషుల కూ ఎవరికైనా అనారోగ్యం సంభవిస్తే మనకెలా ఉంటుంది?
ఆనందీబాయి జోషి వంటి తెలివైన అమ్మాయి కి వైద్య సేవ చేయాలనే ఆలోచన కలిగింది .
ఇక ఊరుకున్నారా? లేదు !
పట్టుదల శ్రమ శీలత ఉన్నవారు సమాజం కోసం సేవలందిస్తుంటారు . ఆనందబాయి గారు కూడా డాక్టర్ కోర్స్ నేర్చుకున్నారు. ఎక్కడ అనుకున్నారు? అమెరికాలో! అన్నేళ్ళ క్రిందనే!
పాశ్చాత్య దేశ వైద్యశాస్త్రం లో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ కూడా ఈమే. ఉన్నత విద్య కోసం అమెరికా కు వెళ్ళి న తొలి హిందూ మహిళ కూడా ఈమేనని రికార్డు ఉన్నది.

ఆనందబాయి గారు మహారాష్ట్ర పూణేలోని సనాతన సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో 31 మార్చి, 1865 లో జన్మించింది. ఈమె తల్లితండ్రులు యమున అని పేరు పెట్టారు. ఆ కాలంలో బాల్యవివాహాల సాంప్రదాయం ఉండేది. ఈమెకు 9 సంవత్సరాల వయసులో దాదాపు ఇరవై సంవత్సరాలు పెద్దయిన గోపాల్ రావు జోషితో వివాహం జరుగింది. పెళ్ళయ్యాక ఆమె భర్త ఆమెకు ఆనందీబాయి అని పేరు పెట్టారు. గోపాల్ రావు, తపాలాశాఖలో గుమాస్తాగా పనిచేసేవారు. గోపాల్ రావు సామాజిక భావాలు కలిగిన వారు కాబట్టి మహిళల విద్యకు మద్దతు పలికాడు. విద్య అనేది ఆనాటి బ్రహ్మణుల కుటుంబాలలో సర్వసాధారణంగా ఉండేది. విద్యపట్ల ఆనందీబాయికి ఉన్న ఆసక్తి గమనించి, ఆంగ్లం నేర్చుకోవడానికి సహాయం చేశారు. 14 సంవత్సరాల వయస్సులో, ఆనందీబాయి ఒక బాలుడికి జన్మనిచ్చింది. కానీ అవసరమైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోవడంతో బాలుడు పది రోజుల్లోనే మరణించాడు. కొడుకు చనిపోవడమనే ఈ సంఘటన ఆనందీబాయి జీవితంలో ఒక మలుపుకు తిప్పింది. తను వైద్యురాలు కావాలని గట్టిగా నిశ్చయించుకుంటుంది.
ఆనందబాయి భర్త
గోపాలరావు కూడా తన భార్య వైద్యశాస్త్రాన్ని అభ్యసించడానికి ప్రోత్సహించాడు. అనందీబాయి భర్త ఆమెకు అమెరికాలో విశ్వవిద్యాలయం ప్రవేశం కొరకు ప్రయత్నాలు చేసాడు. 1880 లో, అతను రాయల్ విల్డర్ , ఒక ప్రసిద్ధ అమెరికన్ మిషనరీ వ్యక్తి కి వ్రాసిన లేఖ రాశారు. అందులో ఆనందీబాయికి యునైటెడ్ స్టేట్స్‌ లో వైద్య అధ్యయనం చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఆమెకు వైద్య శాస్త్రం పైగల ఆసక్తిని తెలుపుతూ, ఆమె కోసం అమెరికాలో సరైన ఉద్యోగానికై సహాయపడాల్సిందిగా కోరారు. ఆలుమగలు క్రైస్తవమతం స్వీకరిస్తే సహాయం ఇవ్వగలనని విల్డర్ ప్రతిపాదించాడు. అయితే ఈ ప్రతిపాదనను జోషి దంపతులు తిరస్కరించారు . అప్పుడు విల్డర్ ఈ ఉత్తరప్రత్యుత్తరాలను తన సొంత పత్రికైన ప్రిన్సటన్ మిషనరీ రివ్యూలో ప్రచురించాడు.

ఎంత వింత చూడండి. రొస్సెల్ అనే ఆమె , న్యూజెర్సీకి చెందిన థియోడెసియా కార్పెంటర్ ఒకామె ఈ పత్రికలో ఆనందీబాయి గురించి చదివింది. వైద్యవిద్య చదవాలన్న ఆనందీబాయి తపన, దాన్ని ప్రోత్సహిస్తున్న భర్త విషయం ఆమెను కదిలించింది. ఆనందీబాయికి ఉత్తరం వ్రాసి తాను ఆనందీబాయి అమెరికాలో ఉండటానికి వసతి సహాయం చేస్తానని చెప్పింది. చూసారా ఒక మంచి పని చేస్తాము అంటే పది మంది ముందుకు వస్తారు అని అంటారు కదా ఇక్కడ అదే విధంగా జరిగింది. కార్పెంటర్‌కు, ఆనందీబాయికి మధ్య చాలా విషయాలపైన ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి. పరస్పరం అభిప్రాయాలు తెలుసుకున్నారు . బాల్యవివాహం కారణంగా స్త్రీలు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్న విషయం కూడా ఒకటి కావటం బహుషా ఈ సహాయానికి కారణం కావచ్చు.

ఆనందబాయి గారి కి సీట్ రావడం అమెరికా కు వెళ్ళడం జరిగిపోయాయి. ‘సెరంపోర్ కాలేజ్’ హాలులో ఆనందీబాయి ఉపన్యసించారు . ఆ సమయంలో తాను వైద్యవిద్యను అభ్యసించడానికి అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటుందో హృదయాలకు హత్తుకునేలా చెప్పారు. ఆమెభర్త , ఆమె పిల్లవాడు చనిపోయిన సందర్భంలో అనుభవించిన బాధను గురించి తన ఉపన్యాసంలో వివరించగా అందరూ చలించిపోయారు.
అంతేకాదు భారతదేశంలో మహిళావైద్యుల అవసరం ఎంతో ఉన్నదని వివరించారు. ఆమె భారతదేశంలో మహిళా వైద్య కళాశాల ప్రారంభించడం తన లక్ష్యమని చెప్పారు. అక్కడ చదువుకోవాలంటే మతం మీరన్నా, తాను క్రైస్తవమతాన్ని స్వీకరించనని చెప్పి, అదే మాట పై నిలబడి ఉన్నారు. ఈ ఉపన్యాసం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. భారతదేశం నలుమూలల నుండి ఆర్థికసహాయం చేస్తామని సందేశాలు వచ్చాయి. ఆమె విద్యకు సహాయంగా అప్పటి భారత వైస్రాయ్ కూడా 200 రుపాయల ఆర్థికసాయం పంపాడు. భర్తకు అమెరికాలో ఉద్యోగం దొరకలేదు. ఈ కారణంగా అనందీబాయి మాత్రం ఒంటరిగా ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్ళింది. విపరీతమైన వ్యతిరేకతల నడుమ ఆమె 1883 జూన్ మాసంలో వైద్యవిద్యాభ్యాసానికి అమెరికాలో అడుగుపెట్టింది.
ఆనందీబాయి కలకత్తా నుండి న్యూయార్క్ వరకూ నౌకలో ప్రయాణం చేసారు. ఈ ప్రయాణంలో ఆమెకు తోడుగా ఇద్దరు ఇంగ్లీష్ మహిళలు ఉన్నారు. 1883 జూన్ లో న్యూయార్క్ లో ఈమెను స్వాగతించడానికి కార్పెంటర్ వచ్చింది. అమెరికాలో మిసెస్ కార్పెంటర్ ఇంటికి ఆనందబాయి అతిథిగా వెళ్ళారు .
న్యూయార్క్ లో 1983లో థియోడిసియా కార్పెంటర్ ఆనందీబాయి గారు ఉండడానికి బాధ్యత తీసుకున్నది. ఆనందబాయి, కార్పెంటర్ ఒకరికొకరు అత్యంత ఆత్మీయులయ్యారు .కార్పెంటర్ ఆనందీబాయిని కుమార్తెగా భావించింది. ఎంతో అభిమానంతో చాలాసార్లు. ఆనందబాయి ను చూసి కార్పెంటర్ ఆశ్చర్యపోయేవారు . ఆమెలోని పట్టుదల , తెలివి , సంస్కారం ఆ ఇంగ్లీష్ వనితను కదిలించాయి. అమెరికా జీవన వైవిధ్యం ఆనందబాయి ను విస్మయపరిచాయి.

ఆనందబాయి వైద్య శాస్త్ర అధ్యయన ప్రయాణం ఇక్కడ తో ఆగలేదు.పెన్సిల్వేనియా మహిళా వైద్యకాలేజీలో వైద్యవిద్య కొనసాగింపు కోసం ఈమె అప్లికేషన్ పెట్టుకున్నారు. మొట్టమొదటి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న పెన్సిల్వేనియా మెడికల్ కాలేజ్ నిర్వాహకులకు , ఆనందబాయి పాల్గొంటాను అని ఒక లెటర్ వ్రాసారు. అదే ప్రపంచ మొట్టమొదటి మహిళా మెడికల్ క్యాంప్. రేచెల్ బాడ్లీ, కాలేజీ డీన్, ఆనందబాయి అర్హత లేని చూసి , ఆమెకు ఈ విద్యా కోర్సులు చేయడానికి అనుమతి ఇచ్చారు.
ఈమె సహాధ్యాయినులైన కెయి ఒకామీ మరియు సబాత్ ఇస్లాంబులీ కెయి ఒకామీ పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన తొలి జపాను మహిళ. ఆనందబాయి అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఫిలడెల్ఫియా విశ్వవిద్యాలయంలో ఆమెను పట్టుకొని కార్పెంటర్ పసిపిల్లా విలపించారట!వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎంతో గొప్ప దో తెలుస్తుంది.
ఇక్కడి కి వచ్చాక కాలేజీ సెక్రెటరీ, సూపరింటెండెంట్ సుదూరం నుండి విద్యాభ్యాసానికి వచ్చిన ఆనందబాయి అందరికీ ఆశ్చర్యమే! ఆమెను ఆనందీగోపాలు అనేవాళ్ళు. ఈమెను చూసి ప్రభావితమై అక్కడ ఉన్న 3 సంవత్సరాలు 600 అమెరికన్ డాలర్లను ఉపకారవేతనం ఏర్పాటుచేసారు కాలేజీ వాళ్ళు. ఆనందీగోపాలం తన 19వ ఏట వైద్య విద్యను ప్రారంభించారు.
ఆనందీగోపాలం అమెరికాలో ఎదుర్కొన్న ప్రధానసమస్య చలి తీవ్రత! అక్కడి శీతోష్ణస్థితి సరిపడా లేదు. ఆమె 9 గజాల మహారాష్ట్ర సాంప్రదాయ శైలి చీర ధారణ కాబట్టి చలిని ఆపలేదు. తరువాత గుజరాతీ శైలిలో చీరను ధరించాలని నిర్ణయించుకోవటం విశేషమైతే అది ఆమె భర్తకు తెలియజేయకూడదని నిర్ణయించడం మరొక ప్రత్యేకత. అయినా ఆమెకు కాలేజి వాళ్ళు ఏర్పాటు చేసిన గదిలో సరైన ‘ఫైర్‌ ప్లేస్’లేకపోవడం , ఉన్న ఫైర్‌ ప్లేస్ నుండి అత్యధికంగా పొగరావడం వలన ఆమెకు చలి నో పొగ భరించవలసిన పరిస్థితో ఎదురైంది.
రెండు సంవత్సరాల తరువాత ఆమెకు అపస్మారకం మీ. తీవ్రజ్వరం అధికమైంది. అప్పుడు మొదలైన దగ్గు ఆమెను చివరి వరకు వదిలిపెట్టలేదు.
ఆమె తీవ్ర ఆరోగ్యసమస్యలతో బాధపడుతూనే మూడు సంవత్సరాల ఉన్నతవిద్యాభ్యాసం పూర్తిచేసి చివరి పరీక్షలు వ్రాసి,మార్చి11, 1886 న ఆమె వైద్యవిద్యలో డాక్టరేట్ సాధించింది. ఆమె పరిశోధనాంశం ‘‘ఆర్య హిందువులలో స్త్రీ జననాంగ-శిశు సంబంధిత వైద్య’’. స్నాతకురాలయిన సందర్భంలో విక్టోరియా మహారాణి కూడా ఆమెకు శుభాకాంక్షలతో ఒక సందేశాన్ని పంపారు. ఆమె పట్టభద్రోత్సవంలో ఆమె భర్త కూడా పాల్గొన్నాడు. ఆ ఉత్సవంలో ఆమెను మొట్టమొదటి భారతీయ వైద్యురాలుగా పేర్కొనడం ఆమెకు మరపురాని అనుభూతిని కలుగజేసిందని ఆమె తన కథనాలలో పేర్కొన్నది. ఆ ఉత్సవంలో పండిత రమాబాయి పాల్గొనడం మరో ప్రత్యేకత.

కాలం చిత్రమైందని ఊరికే అంటారా? ఆమె ఆరోగ్యం రోజుకు రోజుకు దిగజారడంతో ఆమె భర్త ఆమెను ఫిలడెల్ఫియా స్త్రీల ఆసుపత్రిలో చేర్చాడు. ఆమెకు క్షయ వ్యాధిగా నిర్ధారించబడింది. వ్యాధి ఇంకా ఊపిరితిత్తులని చేరలేదు. వైద్యులు ఆమెను భారతదేశానికి తిరిగివెళ్ళమని సలహా ఇచ్చారు. అందుకు ఆమె అంగీకరించింది.భారతదేశానికి తిరుగుప్రయాణం చేసే సమయంలో ఆనందీబాయి ఆరోగ్యం మరింత దిగజారింది. నౌకలో ప్రయాణం చేసే సమయంలో ఆమెకు చికిత్స చేయడానికి వైద్యులు నిరాకరించారు. వైద్యులు చికిత్సచేయడానికి నిరాకరించడానికి కారణం ఆమె ” బ్రౌన్ వుమన్ ” సాధారణంగా భారతీయులను బ్రౌన్ ప్రజలు అంటార. 1886 చివరిభాగంలో, ఆనందిబాయి భారతదేశానికి తిరిగివచ్చారు.

మన భారతదేశం ఆనందీగోపాలం కు ఘనంగా స్వాగతం పలికింది. ఆమెను కొల్హాపూర్ సంస్థానానికి చెందిన వైద్యురాలిగా నియమించింది. అల్బర్ట్ ఎడ్వర్డ్ వైద్యశాలలోని మహిళా వార్డుకు అధికారిణిగా బాధ్యతలను అప్పగించింది.కలకత్తా చేరిన తరువాత ఆనందీబాయి బలహీనత, తలనొప్పి, తరచూ జ్వరం వస్తుండేది. ఆయాసాలతో బాధపడింది. థియోడిసియా ఆమెకు అమెరికా నుండి ఔషధాలను పంపింది. తరువాత ఆమె ఆయుర్వేద చికిత్స కొరకు బంధువుల ఇంట్లో బసచేసింది. ఆయుర్వేద వైద్యనిపుణుడు ఆమె నౌకాయానం చేసి విదేశాలకు వెళ్ళి సంప్రదాయ సరిహద్దులు దాటినందుకు ఆమెకు చికిత్సచేయడానికి నిరాకరించాడు.

అమెరికా నుండి తిరిగివచ్చిన ఒక్క సంవత్సరంలోపుగానే ఆమె ఫిబ్రవరి 26, 1887 తేదీన 22 సంవత్సరాల చిన్నవయసులోనే అకాలమరణం చెందారు. ఆనందీబాయి మరణానికి దేశం అంతటా విషాదం ఆవరించింది. ఆనందీబాయి చితాభస్మం థియోడిసియా కార్పెంటర్ కు పంపించారు. కార్పెంటర్ వాటిని పూకిప్సీ, న్యూయార్క్ లోని తమ కుటుంబ శ్మశానవాటికలో బధ్రపరచింది. ఆనందీబాయి సమాధి శిలాఫలకాన్ని ఈ శ్మశానవాటికలో ఇప్పటికీ ఉన్నది.

కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. అమెరికాలో ప్రసిద్ధ స్త్రీవాద రచయిత, సంస్కరణకర్త అయిన కారోలైన్ వెల్స్ హీలీ డాల్ 1888లోనే ఆనందీబాయి ఆత్మకథను వ్రాసింది.దూరదర్శన్ ఆనందీబాయి జీవితాన్ని ఆధారం చేసుకొని తీసిన ధారావాహిక “ఆనందీ గోపాల్”ను ప్రసారం చేసింది. ఈ ధారావాహికకు కమలాకర్ సారంగ్ దర్శకత్వం వహించారు.
శ్రీకృష్ణ జనార్ధన జోశీ తన మరాఠీ నవల “ఆనందీ గోపాల్”లో ఆనందీబాయి జీవితంలోని కొన్ని ఘటనలను పొందుపరిచారు ఈ నవల ఆషా దామ్లే ద్వారా ఆంగ్లంలోకి అనువాదమయి సంక్షేప రూపం లో వచ్చింది. అదే పేరుతో రాం జీ జోగ్లేకర్ ఒక నాటకాన్ని కూడా రాసారు.

ఆనందబాయి వైద్య శాస్త్ర విజ్ఞానం ఎందరికో ఆదర్శంగా నిలిచిపోతుంది.

నెల్లుట్ల ఇంద్రాణి

Written by Nellutla Indrani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మసకబారిన మాతృత్వం

నా లాగ ఎందరో