మురారి కథలో ప్రేమ పాశం

                    యోగులు పలురకాలు.వీళ్ళు సమాజహితం కోరుతూ శిష్యులకు బోధనలు చేయడం మామూలే. కాని  ఇటీవల వీళ్ళ దర్శనం కరువైంది. సాధారణంగా  వీళ్ళను నమ్మే  జనం  భక్తి ప్రపత్తులతో సేవలు చేస్తారు. పూజిస్తారు. వాళ్ళ దర్శనం కోసం తహతహలాడుతారు..ఆశ్రమంలో ఉండే ఈ యోగులకు కట్న కానుకలు విరాళాలివ్వడమూ మామూలే.  వాళ్ళను కలువాలంటే నియమనిబంధనలు పరిమితులు చాలానే ఉంటై.ఈ భిన్నయోగులలో కొందరికి భోగులకుండే సౌకర్యాలుంటై. అంతకంటే ఎక్కువ కూడా. వాళ్ళు కేవలం వేషధారణకే పరిమితులు. ఇక చర్యల్లో   ప్రజల …ప్రభుత్వ…. భూములను తమ అధీనంలోకి తెచ్చుకోవడమే కాదు అమాయక స్త్రీలను  ఉపదేశాల పేరిట,సంతానం పేరిట మోసం చేయడం, అత్యాచారాలు చేయడం,తమ బండారం బయటపడుతుందనే ఆలోచనతో ఏకంగా హత్యలుచేయడం కూడా  సాదాసీదాగా జరుగుతూనే ఉంటై.వీళ్ళంతా మేకవన్నె పులులే.ఈ అనుభవాలు మురారి కథలో రామచంద్రం తండ్రికి చాలానే ఉన్నై. అందుకే

 ” నాయినా ఇంటున్నరా ఈ మాట!  ఈ సారి ఈయనెవరో మహానుభావుడే ఉంటడు. భిక్ష ఏర్పాటు చేద్దామా ?” అని తండ్రిని   రామచెంద్రయ్య    అడిగిండో లేదో గతంలో  ఊళ్ళోవాళ్ళకు వచ్చిన స్వాముల చిట్టాను వాళ్ళ మోసపూరిత చర్యలను తవ్విపోసి మందలించిండు రామచంద్రయ్య తండ్రి
                   కానీ ఆ ఊరికి వచ్చిన యోగి జల పడే జాగ చూపించి నలుగురితో కలిసి బాయి తవ్వించిండు.  మాల గూడెం బాయిల నీళ్ళు వడుడు తోటే కుమ్మరోళ్ళు రింగులు కాల్చి ఇచ్చిన్రు. వడ్లోళ్ళు చౌలు, గిర్కలు చేసి ఇచ్చిన్రు. కమ్మరోళ్ళు ఇనుప బొక్కెనలు చేసి ఇచ్చిన్రు.  ఆ సాధువు బాయి పక్కన  గచ్చుగోలెం కట్టిచ్చిండు స్నానానికి అనుకూలంగ.
           మాలగూడెం జనం  ఊరవుతలి ఊర బాయిని ఊరి సేదబాయిని ముట్టగూడదని అగ్ర వర్ణాల శాసనం. అందువల్ల నీళ్లకు అలమటించిన దళితులు విధిలేక గుంతలలో నిలిచిన నీళ్లనో , పొలం గట్ల దగ్గర ఉన్న గుంతల పోతులు పందులు పొర్లిపోయినంక అడుగున మిగిలిన నీళ్లనో దోసెళ్ళతోడి ముంచుకొచ్చుకొని  తాగేవాళ్లు . అదంతా గతం.. కానీ  సాధువు అంటరాని వాళ్ళకు తవ్వించిన  బాయినీళ్ళు పెద్ద కులస్తుల పిల్లలు కూడ తాగడానికి పనికి రావడం గమనించి తీరాల్సిందే.
ఆ సాధువే గూడెం జనంసాయంతో ఊరి బురుద తొవ్వను బెందడితోని గట్టిగా చేయించడంతోపాటు ఆంజనేయులు గుడిని  పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అనుకూలంగ చేయించిండు.  పాడుపడిన పాఠశాలను చక్కగ తీర్చి దిద్దిండు. పిల్లలకు ఆటపాటలు నేర్పిండు.వర్గ భేదం లేకుండ మసులుతూ అపర ప్రవరుడా! అన్నట్లు ఆడవాసనను  చూడక అంటక ముట్టక గ్రామ సేవే పరమావధిగా చేస్తూ బడి పక్క గుడిలో కాలం గడిపిండు. అంటే మనం పైన చెప్పుకున్న. అందరి యోగులకంటె భిన్నమైనవాడు. ‘‘ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం ‘‘అన్నట్లు  ఏ రాగద్వేషాలు లేకుండా నిలిచిండు. పైన ప్రస్తావించినట్లు గ్రామానికి ఏ ప్రభుత్వాలు చేయలేకపోతున్న పనులను తాను చేసి చూపించిండు. తనకు వీలైన సౌకర్యాలు కల్పించిండు.  కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మాలలు మొదలైన వాళ్ళంతా  పరస్పరం సహకరించుకునేందుకు తొవ్వ వేసిండు.సాధువు అనే  రూపానికి సార్థకత చేకూర్చిండు.
                   ఐతే దీనికి గల తార్కికతలోకి పోతే
. . యథార్థంగా ఆ సాధువు ఆ ఊరి అల్లుడు. రామచంద్రయ్య బావ. అంటే చెల్లెలు శాంత భర్త. పైచదువులకోసం పట్నంబోయిన శాంత మురారితో సహ జీవనం చేసింది. కానీ కొద్దిరోజులకే సన్నిపాత జ్వరం వలన చనిపోయింది.

మురారికి శాంతపై అవ్యాజమైన ప్రేమ. ఆమెను మరిచిపోలేకపోయిండు.ఆ జన్మకు ఆమెతో గడిపిన క్షణాలు విలువైనవిగా భావించిండు. ఆమె పుట్టింటి గ్రామానికి చేరుకుని ఆ గ్రామ చైతన్యానికి కృషి చేసిండు.

                    తనతో సహజీవనం చేసిన స్త్రీ చనిపోయినందుకు వైరాగ్యం కలిగింది వాస్తవమే కానీ ఆ వైరాగ్యం లోనూ అతనికి ఓ చైతన్యస్పృహ కలిగింది. ఆ స్పృహలో   తన ప్రేమమూర్తి గ్రామాన్ని సామాజిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలనే తపన కలిగింది. అణగారిన జీవితాలకు ఊపిరి పోయాలనుకున్నడు. ఆ తపనతోనే దళితవాడలవారికి ప్రభుత్వం కూడా తలపెట్టని కొన్ని సౌకర్యాలు కల్పించిండు.ఇది ఎందరికో ఓ గుణపాఠం. ప్రేయసిని పోగొట్టుకున్న, దూరం చేసుకున్న ఎంతోమంది వైరాగ్యంతో సుఖశాంతులకు దూరంకావడంతోపాటు కుటుంబ అశాంతికి సూత్రధారులు కావడం మనం చూస్తునే ఉంటం. అంతేకాదు సైకోలు గా మారి anti social elements గా సమాజంలోనూ శాంతి లేకుండా చేయడం మనందరికీ తెలిసిందే. కాని మన కథలోని సాధువు ఎంతోమందికి మార్గదర్శకుడు.   అజ్ఞానులను జ్ఞానం దిశగా నడిపించే కర్మయోగి. అందుకే

ఆ గ్రామంలో తొలి అడుగు వేసినపుడు ఈసడించుకున్న రామచంద్రయ్య తండ్రే
“చెంద్రా! సాదుకు జెర పెయి ఎచ్చ జేసినట్లుండది. కషాయం బెట్టిచ్చు.”
” ఇయ్యాళ్ళ పుల్లావు ఈనింది. జున్నుపాలు……..పంపండి.”
” కంకులు లేతగ మొగ్గలోలె ఉండవి. రొండు కాల్చి సాదువును పిలువుండి.”
“మక్క గారెలు చేసి ఎన్నపూస రాసి సాదువుకు పంపండి”అంటూ మాట్లాడడంలో
సాదువు పట్ల అతనికి గల ఆప్యాయత  కొట్టవచ్చినట్లున్నది.

               “చెంద్రం! సాదు నిజంగ అవతారపురుషుడో ఏందో? ఎక్కడ అంతువడ్తలేదు. సాదువును
జూసినప్పుడల్ల నాకు శాంతమ్మ  మనసులో మెదుల్తాది.” అని చివరిగా తేల్చిచెప్పడంలో రామచెంద్రు తండ్రికి కూడా సాదు జీవితవిధానంలోని   తార్కికత అర్థమైంది.మురారి అనబడే ఈ సాధువు ఎందరికో  ప్రేమమయుడైన మార్గ దర్శకుడు. ఉదాాత్తుడేకాదు. ధీరోధాత్డుత కూడా

బిర బిర.                     తొందరగా

   పై ముల్లేసింది.              ఉత్సాహం కలిగింది
   దుడ్డు.                          పైస
   మంచి సెబ్ర.                  మంచి చెడు
   రోసినోళ్లు.                     అసహ్యించుకున్నోళ్ళు
   తట్టు.                           దెబ్బ
   చీకటి మడి.                  అత్యాచారం
   సొర్కె.                          సొరంగం
   కసురుగాయలు.           చిన్నపిల్లలు
   ఉల్లెడ పట్టు
   కోడెగాడు.                    యువకుడు
   పొడ.                           నీడ
   కడ్ప.                            కడప
   సేదరబాయి.                 చేదబాయి
   అడ్పా దడ్పా.                అప్పుడప్పుడు
   తావు.                           జాగ
   మడుగు.                      నీళ్ల గుంత
   బర్గె.                             బెత్తము
  చిత్తార్లు.                        చిత్రలేఖనం
  డిరిల్లు.                          డ్రిల్
  నైకర్లు.                          నిక్కర్లు
  పై.                                పెయి ,శరీరం
  బత్తల                          బట్టలు లేకుండా                                                 నగ్నంగా
పబ్బతి.                         దీక్ష
చెండు.                          బంతి (బాల్)
మొగులు.                     మేఘము, మబ్బు
కుయుక్కుమనకుండా.   చప్పుడు చేయకుండా
ల్యాతగా.                       లేతగా
సన్ని పాత్కం.                 సన్నిపాత
అంగలార్సి.                    దుఃఖించి
 దుక్కం                          దుఃఖం
సామెతలు
పుర్రెన పుట్టిన బుద్ధి పుల్లెల వేసినా పోదంట
లేనోడు లేకేడిస్తే ఉన్నోడు కడుపు కట్టడం
ఎంగిలి సేత కాకిని కొట్టకుండా
గుర్రం పోత పోత గూటం పీక్కపాయె
పూసిన సంపెంగ తుమ్మెదలకు పనికిరానట్లు
నక్కెక్కడా నాగలోకం ఎక్కడ
ఇటేటు రమ్మంటే  ఇల్లంత నాదే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అనుభూతి

భారత కోకిల – సరోజినీనాయుడు