
ఓం అగ్ని మీళే పురోహితం యజ్ఞస్య దేవా ఋత్విజమ్
హోతారం రత్నధాతమం
ఈ మంత్రము ఋగ్వేదములోని మొదటి అధ్యాయములోని మొదటి మండలములోని మొదటి మంత్రము. ఈ మంత్రమును పూజలలోనూ యజ్ఞ యాగాదులలోనూ విశ్వశాంతి కొరకై చదువుతారు. మనందరికీ తెలుసువేదాలు నాలుగని. ఋగ్వేదములl యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము. భగవంతునిచే తపస్ సంపన్నులైనటువంటి మహా యోగిపుంగవుల హృదయాలలో వేద మంత్రాలు స్ఫురింప చేయబడినవని చారిత్రాత్మకంగా తెలియుచున్నది.
ఇప్పుడు మనము ఈ మంత్రము యొక్క ప్రతిపదానికి భావార్ధములను తెలుసుకుందాము.
అగ్ని మీళే —–నేను అగ్నిని ప్రార్థిస్తున్నాను
పురోహితం — ఈ యజ్ఞమునకు పురోహితునిగా ఉండమని అర్థిస్తున్నాను
యజ్ఞస్య —- ఈ యజ్ఞమునకు లేదా హవనమునకు. హవనమునకు మరొక పేరు యజ్ఞము దానినే దేవ యజ్ఞము అని కూడా అంటారు
దేవా — దేవునికిచ్చే హవిస్సులందు
ఋత్విజమ్ – –ఈ పురోహితులందరిలోను
హోతారం —- హోత అనే పురోహితునిగా
రత్న ధాతమం —– అందరికీ ఆయురారోగ్యాలు దానంయూ యశస్సు ఇవ్వబడాలని ఆశిస్తున్నాము.
ఈ మంత్రమునందు మనము భగవత్ స్వరూపుడైనటువంటి అగ్నిని ప్రార్థిస్తున్నాము.
యజ్ఞకర్తయైన హోత సదుద్దేశముతో నిర్వహింపబడే ఈ యాగములో ఇచ్చే పవిత్రమైన హవిస్సుల ద్వారా అందరికీ ఆరోగ్యము సంపద మరియు అందరికీ మంచి జరుగవలెనని ఆశిస్తున్నారు.
యజ్ఞమునందు నలుగురు ముఖ్యమైన యజ్ఞకర్తలు ఉంటారు. వారు బ్రహ్మ, ఆధ్వర్య, ఉద్గాత ఇంకా హోత. ఉద్గాత యాగాన్ని ప్రారంభిస్తాడు, అధ్వర్యు హవిస్సుల ప్రాధాన్యతను సంతరించుకుంటాడు.సాంప్రదాయకంగా బ్రహ్మ ప్రధాన పూజారిగా పౌరోహిత్యం వహిస్తాడు. హోత ఆధ్వర్యంలో మంత్రాలను చదువుతారు. ఉద్గాత ద్వారా వినసొంపగు స్వరయుక్త మంత్రాలతో యాగం ఆరంభము నిర్వహింపడుచున్నది.
సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ మంత్రము ద్వారా అగ్నిస్వరూపుడైన పరమాత్మను యజ్ఞములో కిచ్చ్చే పవిత్రమైన హవిస్సులందు హోత గా వ్యవహరించామని కోరుతున్నాం.
ఎందుకంటే అగ్ని మాధ్యమముగా మనం యజ్ఞములో ఇచ్ఛే హవిస్సులను, వాటిలో ఉండే సామాగ్రి నెయ్యి పాలు మరియు సుగంధ ద్రవ్యాలను మొదలైన వస్తు సామాగ్రిని పరమాణువులుగా మార్చి వాతావరణములో విస్తరింపజేస్తుంది. వాతావరణాన్ని శుద్ది చేస్తుంది. మన యాగం ద్వారా వాటిలో ఇచ్చ్చే పవిత్రమైన హవిస్సుల ద్వారా అందరికీ సదా మంచి జరగాలని, ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధి (రత్న ధాతమం) కలగాలని ఆశిస్తూ ఆశీర్వచనం కోరుతున్నాము. అందువలన ఈ మంత్రం చాలా ప్రభావం కలిగినది. దీనిని యజ్ఞం చేసేటప్పుడు ప్రధమంగా చదువుతారు.
ఉదాహరణకు యాగం ఒక రాజు అయితే అగ్నిదేవుడు దేవతాస్వరూపుడైన ఒక ప్రధాన యజ్ఞకర్త. అతను యాగం ద్వారా వచ్చే హవిస్తుల ద్వారా వచ్చే సత్ఫలితాలను ఆశీర్వచనాలను యజమానుడైనటువంటి బ్రహ్మ ద్వారా అందరికీ సమర్పిస్తారు. రత్నధాతమం అంటే ఈ అగ్ని ద్వారా పవిత్రమైనటువంటి లక్షణాలను పవిత్రతను అందరికీ చేకూరాలని ఆశయం. కాబట్టి ఈ మంత్రము చాలా ముఖ్యమైనది మరియు ప్రాథమికమైనది.